by సూర్య | Fri, Apr 09, 2021, 02:03 PM
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందుతుతోంది. ఇది ముంబై నేపథ్యంలో సాగే కథ. అందువలన చాలా రోజులుగా పూరి అక్కడే ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. విజయ్ దేవరకొండ .. అనన్య పాండేతో పాటు ఇతర ముఖ్య పాత్రధారులంతా ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. అయితే ముంబైలో కొన్ని రోజులుగా కరోనా కేసులు అనూహ్యమైన రీతిలో పెరిగిపోతున్నాయి. మున్ముందు అక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది తెలియని వాతావరణం ఉంది. అందువలన 'లైగర్' షూటింగును ఆపేసినట్లు తెలుస్తోంది.
Latest News