by సూర్య | Fri, Apr 09, 2021, 01:37 PM
ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. సినిమా సెలబ్రిటీలు షూటింగ్స్కు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. గత ఏడాది కరోనా వలన తొమ్మిది నెలల పాటు షూటింగ్స్ లో పాల్గొనలేకపోవడంతో ఈ సారి రిస్క్ చేసి మరీ షూటింగ్స్ చేస్తున్నారు.అయితే సెట్స్ లోకి అడుగుపెట్టే ముందు పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్పుత్ తన తదుపరి చిత్ర షూటింగ్లో పాల్గొనేందుకు కరోనా పరీక్షలు చేయించుకుంది.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
గత ఏడాది కరోనా పరీక్ష చేయించుకున్నప్పుడు ఎగిరి గంతేసినంత పని చేసిన పాయల్ రాజ్పుత్ ఈ సారి మాత్రం కాస్త కూల్గానే కనిపించింది. చివరిగా చేయించుకున్న కరోనా పరీక్షలో పాయల్కు నెగెటివ్ రాగా, ఇప్పుడు ఇంకా రిజల్ట్ రాలేదని తన పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం పాయల్ చేతిలో పెద్దగా సినిమాలేవి లేకపోగా, ఇప్పుడు ఈ అమ్మడు ఏ సినిమా సెట్లో అడుగుపెట్టేందుకు పరీక్ష చేయించుకుందని ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు.
Latest News