by సూర్య | Wed, Apr 07, 2021, 02:33 PM
ఒక సినిమా విడుదలైతే థియేటర్స్ లలో ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కావడం లేదు. హిట్ టాక్ వస్తే లాభాలు బాగానే వస్తున్నాయి. కానీ అదే యావరేజ్ టాక్ వస్తే మాత్రం వారం తిరక్కుండానే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం డిజిటల్ గా చిన్న సినిమాలకు మంచి లాభాలు అందుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వకపోయినా కూడా ఓటీటీ ద్వారా మంచి ప్రాఫిట్స్ ను అందుకుంటున్నాయి. ఇక ఉప్పెనతో పాటు, జాతిరత్నాలు కూడా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి నటించిన ఈ రోమాంటిక్ లవ్ స్టొరీ బాక్సాఫీస్ వద్ద దాదాపు 55కోట్లకు పైగా లాభాలను అంధించింది. ఇక ఫిబ్రవరి 12 న వచ్చిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. శర్వానంద్ శ్రీకారం పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికి సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్కవ్వలేదు. దాదాపు 7కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా సన్ NXT లో 16వ తేదీ నుంచి సందడి చేయనుంది. ఇక ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన జాతిరత్నాలు మొదటి రోజు నుంచే హిట్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 12రోజుల పాటు కోటికి తక్కువ కాకుండా షేర్ ను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు 30కోట్లకు ప్రాఫిట్స్ ను అంధించి నటీనటులకు టెక్నీషియన్లకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 11నుంచి సందడి చేయనుంది.
Latest News