by సూర్య | Thu, Mar 25, 2021, 12:28 PM
దర్శకుడు పద్మశ్రీ ప్రతిభ దర్శకత్వంలో ఆర్కే సాగర్ నాయుడు హీరోగా దృశ్యా రఘునాథ్ జంటగా నటించిన కంప్లీట్ ఎంటర్ టైనర్ చిత్రం “షాదీ ముబారక్”. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. గురువారం నుంచి “షాదీ ముబారక్” చిత్రాన్ని అమోజాన్ ప్రైమ్ లో ఫిల్మ్ లవర్స్ చూడొచ్చు. తొలి చిత్రంతోనే దర్శకుడు పద్మశ్రీ ప్రతిభ ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు “షాదీ ముబారక్” చిత్రాన్ని ఇటీవల విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు సున్నిపెంట మాధవ్ పాత్రలో సాగర్ నాయుడు, మ్యారేజ్ బ్యూరో నుంచి అతనికి పెళ్లి చేసే బాధ్యతను తీసుకున్న తుపాకుల సత్యభామ క్యారెక్టర్ లో దృశ్యా రఘునాథ్ చేసిన ఆన్ స్క్రీన్ సందడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. “షాదీ ముబారక్” చిత్రానికి థియేటర్ ను మించిన రెస్పాన్స్ అమోజాన్ ప్రైమ్ లో వస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది.
Latest News