by సూర్య | Tue, Jan 19, 2021, 03:55 PM
తమిళ స్టార్ హీరో అజిత్ బైక్ డ్రెవింగ్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. పదులు కాదు.. వందలు కాదు..ఏకంగా వేల కిలో మీటర్లు బైక్ పై తిరిగి రికార్డు సృష్టించాడు. లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ నుండి చెన్నై వరకు అజిత్ బైక్ పై వెళ్లాడు అంటూ వార్తలు హల్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు వారణాసి ఇంకా ఉత్తర భారతం కు బైక్ రైడ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అజిత్ ఇప్పటికే 4500 కిలో మీటర్లను బైక్ పై ట్రావెల్ చేసి చేరుకున్నారు.
వారణాసిలో బైక్ తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చెన్నై నుండి సిక్కింకు తన దగ్గరున్న బిఎండబ్ల్యు బైక్పై ట్రిప్ స్టార్ట్ చేసేశాడు అజిత్. ఇప్పటికే వారణాసిని కూడా అజిత్ చేరుకున్నాడు. అక్కడ రెండు, మూడు రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ సిక్కిం నుండి చెన్నై బైక్ పేనే చేరుకుంటాడట. ఈ మొత్తం ట్రిప్ దూరం 4500 కి.మీ. ఈ ట్రిప్ నుండి వచ్చిన తర్వాత అజిత్.. వలిమై చిత్రీకరణలో పాల్గొంటాడు. ఇంత భారీ రైడ్ ను ఏ ఒక్క హీరో కూడా చేయలేదు అనడంలో సందేహం లేదు. ఒక హీరోగా ఇంత రైడ్ చేయడం రికార్డ్ గా చెప్పుకోవాలి.