కంగనా 'మణికర్ణిక' చిత్రానికి సీక్వెల్ రాబోతోంది

by సూర్య | Sat, Jan 16, 2021, 11:48 AM

కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక' సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్టు కంగనా ప్రకటించింది. సీక్వెల్ సినిమా పేరు 'మణికర్ణిక రిటర్న్స్: ద లెజండ్ ఆఫ్ దిద్దా'. ఈ సినిమాను 'మణికర్ణిక'ను మించిన బడ్జెట్టుతో.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. మణికర్ణికను నిర్మించిన నిర్మాత కమల్ జైన్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కశ్మీర్ మహారాణి, యోధురాలు దిద్దా కథగా తెరకెక్కుతోంది. మహ్మద్ గజనీని రెండుసార్లు యుద్ధంలో ఓడించి, ఒక కాలు పోలియో కారణంగా చచ్చుబడినప్పటికీ.. యుద్ధంలో తెగువ, పోరాటపటిమ చూపిన ధీరవనిత దిద్దా. ఇప్పుడీ కథలో దిద్దా పాత్రలో కంగనా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM