by సూర్య | Sat, Jan 16, 2021, 11:48 AM
కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక' సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్టు కంగనా ప్రకటించింది. సీక్వెల్ సినిమా పేరు 'మణికర్ణిక రిటర్న్స్: ద లెజండ్ ఆఫ్ దిద్దా'. ఈ సినిమాను 'మణికర్ణిక'ను మించిన బడ్జెట్టుతో.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. మణికర్ణికను నిర్మించిన నిర్మాత కమల్ జైన్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కశ్మీర్ మహారాణి, యోధురాలు దిద్దా కథగా తెరకెక్కుతోంది. మహ్మద్ గజనీని రెండుసార్లు యుద్ధంలో ఓడించి, ఒక కాలు పోలియో కారణంగా చచ్చుబడినప్పటికీ.. యుద్ధంలో తెగువ, పోరాటపటిమ చూపిన ధీరవనిత దిద్దా. ఇప్పుడీ కథలో దిద్దా పాత్రలో కంగనా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.