by సూర్య | Mon, Oct 19, 2020, 05:31 PM
యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ్ కృష్ణ, డస్కీ బ్యూటీ రష్మీ గౌతమ్ జంటగా నటించిన చిత్రం 'బొమ్మ బ్లాక్బస్టర్'. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రాజ్ విరాట్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్, టీజర్ విడుదల తర్వాత వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఆడియో ఆల్బమ్ నుంచి 'రాయే నువ్వు రాయే' అనే పాటను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
ఇక ఈ సినిమాలో నందు ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ ఫ్యాన్గా నటిస్తున్నాడనే విషయం టీజర్, ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమైంది. నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉండబోతుందని, నందు పాత్రకు ధీటుగా రష్మీ గౌతమ్ పాత్ర కూడా ఉండబోతోందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రం షూటింగ్తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాతలు తెలిపారు. లహరి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలైంది.
Latest News