కీర్తి సురేష్ లేదా ‌సాయి పల్లవి.. ఈ ఇద్దరిలో ఎవరు..?

by సూర్య | Fri, Oct 16, 2020, 12:25 PM

చిరంజీవి తమిళ వేదాలం రీమేక్‌లో నటించనున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఆచార్య మూవీ తరువాత చిరు ఇందులో నటించనుండగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే వేదాలంలో చెల్లలి పాత్రకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఒరిజనల్‌లో ఈ పాత్రలో లక్ష్మీ మీనన్ నటించారు. ఆ పాత్రకు గానూ ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది.
ఇక తెలుగు రీమేక్‌లో ఈ పాత్ర కోసం ఇప్పుడు ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి సాయి పల్లవి, మరొకటి కీర్తి సురేష్‌. ఇందులో సాయి పల్లవి ఫిక్స్ అయినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చినా.. మధ్యలో కీర్తి పేరు వినిపించింది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు చిరు చెల్లెలిగా నటిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నటనలో ఈ ఇద్దరు ఎవరికి వారే సాటి. ఇక ఆ పాత్రకు ఈ ఇద్దరిలో ఎవ్వరైనా న్యాయం చేయగలరు. ఇలాంటి నేపథ్యంలో చివరకు ఎవరూ చిరు చెల్లెలు పాత్రకు ఫిక్స్ అవుతారన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ ఇద్దరు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM