ఆ హీరోయిన్ పేరుచెప్పి 13 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు...

by సూర్య | Wed, Oct 14, 2020, 12:41 PM

ప్రముఖ సినీ నటి ప్రణీత పేరుతో ఓ ముఠా చెలరేగిపోయింది. ఓ కంపెనీ యజమానిని రూ. 13.50 లక్షల మేర మోసం చేసింది. బెంగళూరులో జరిగిందీ ఘటన. ఈ నెల 6న చెన్నైకి చెందిన కొందరు వ్యక్తుల ముఠా బెంగళూరు వచ్చింది. అక్కడి ఓ హోటల్‌లో ఎస్‌వీ గ్రూప్ అండ్ డెవలపర్స్ కంపెనీ చైర్మన్ అమరనాథ్‌రెడ్డిని ఈ ముఠా కలిసింది. ముఠాలోని వర్ష అనే యువతి తాను ప్రణీత మేనేజర్‌నని అమరనాథ్‌రెడ్డిని నమ్మబలికింది.


ఎస్‌వీ గ్రూప్‌నకు ప్రచారకర్తగా ప్రణీతను కుదురుస్తామని, త్వరలోనే అగ్రిమెంట్ చేయిస్తానని చెప్పడంతో అమరనాథ్‌రెడ్డి సరేనన్నారు. ఒప్పందంలో భాగంగా ఆయన వారికి రూ.13.50 లక్షలు చెల్లించారు. డబ్బులు తీసుకుని వెళ్లిన తర్వాత ముఠా నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానని భావించిన అమరనాథ్‌రెడ్డి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM