'సీసీసీ'కి హీరో సుశాంత్ విరాళం రూ. 2 ల‌క్ష‌లు

by సూర్య | Wed, Apr 01, 2020, 11:54 AM

షూటింగ్‌లు నిలిచిపోవ‌డం వ‌ల్ల ఆదాయం లేక ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకోవ‌డానికి ఏర్పాటు చేసిన 'క‌రోనా క్రైసిస్ చారిటీ'కి హీరో సుశాంత్ రూ. 2 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా ఆయ‌న తెలియ‌జేశారు. సోమ‌వారం ఆయ‌న, "ఇవి ఒక‌రినొక‌రు చూసుకోవాల్సిన రోజులు. ఈ సంక్షోభ స‌మ‌యంలో దిన‌స‌రి వేత‌నంతో జీవ‌నం సాగించే సినీ కార్మికుల‌ను ఆర్థికంగా ఆదుకోవ‌డానికి నా వంతు చిన్న సాయంగా రూ. 2 ల‌క్ష‌లు క‌రోనా క్రైసిస్ చారిటీకి అంద‌జేస్తాన‌ని విన‌మ్రంగా తెలియ‌జేస్తున్నా. అంద‌రూ త‌మ త‌మ ఇళ్ల‌ల్లో సుర‌క్షితంగా ఉండాల్సిందిగా కోరుతున్నా" అని ట్వీట్ చేశారు.

Latest News
 
OTTలోకి వచ్చేస్తున్న ’గీతాంజలి మళ్లీ వచ్చింది‘ Mon, May 06, 2024, 01:46 PM
గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ శోభా శెట్టి Mon, May 06, 2024, 11:23 AM
మమితా బైజు అసలు పేరు తెలుసా..? Mon, May 06, 2024, 10:40 AM
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM