by సూర్య | Fri, Jan 24, 2020, 04:45 PM
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘పంగా’. అశ్వినీ అయ్యర్ తివారీ తెరకెక్కించారు. జస్సీ గిల్, రిచా చద్దా, నీనా గుప్తా కీలక పాత్రలు పోషించారు. ఈరోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమ కథేంటంటే.. కబడ్డీలో దిట్ట అయిన జయ (కంగన) .. జాతీయ స్థాయిలో ఛాంపియన్గా పేరు తెచ్చుకుంటుంది. కానీ పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఆ గుర్తింపు అంతా పోతుంది. అప్పటిదాకా చప్పట్లతో ఎంకరేజ్ చేసిన జనాలు పెళ్లయ్యాక మాత్రం కనీసం పలకరించడం మానేస్తారు. కానీ జయకి మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్షిప్ సాధించాలని ఉంటుంది. ఇందుకోసం తన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుంది. అలా ఓ పక్క కుటుంబాన్ని చూసుకుంటూనే మరోపక్క అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు సన్నద్ధం అవుతుంది. చివరకు ఏమైంది? అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ టైటిల్ను అందుకోగలిగిందా? అన్నది తెరపై చూడాల్సిందే.
Latest News