by సూర్య | Fri, Jan 17, 2020, 01:57 PM
నగేష్ నారదాసి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సముద్రుడు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ పాతిక రోజుల పాటు చీరాలలో జరిగింది. దీంతో మూడు పాటలు మనహా షూటింగ్ పూర్తిచేశారు. త్వరలోనే పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తామని దర్శకుడు తెలిపారు. చీరాల షూటింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిందని, మత్య్సకారుల బ్యాక్డ్రాప్లో చిత్రీకరణ జరిగిందని నిర్మాత బదావత్ కిషన్ చెప్పారు. దామోజు జ్ఞానేశ్వర్, సోముల రామారావు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రమాకాంత్, భానుశ్రీ, అవంతిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమన్, రామరాజు, సమ్మెట గాంధీ, చిత్రం శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సుభాష్ ఆనంద్, ఛాయా గ్రహణం వాసు, నిర్మాత బదావత్ కిషన్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం నగేష్ నారదాసి.
Latest News