by సూర్య | Fri, Jan 17, 2020, 02:16 PM
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ డే వాల్డ్ వైడ్గా ’అల వైకుంఠపురములో’ దాదాపు రూ. 45 కోట్ల గ్రాస్ రూ. 35 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఐదో రోజైన కనుమన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 11 కోట్ల వరకు షేర్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.64 కోట్లు.. ఓవర్సీస్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా అన్ని కలిపితే ప్రపంచ వ్యాప్తంగా.. రూ. 83 కోట్ల వరకు షేర్...రూ. 125 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఓవర్సీస్లో ఈ సినిమాను సరిలేరు నీకెవ్వరు సినిమా కలెక్షన్లను క్రాస్ చేయడం విశేషం. ‘అల వైకుంఠపురములో’ సినిమా. ఇక ఈ చిత్రం మలయాళంలో ‘అంగు వైకుంఠపురత్తు’ పేరుతో రిలీజై అక్కడ కూడా సంచలనాలు సృష్టిస్తోంది. కేరళలో అల్లు అర్జున్కు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు అక్కడ ఐదో రోజు ఈ సినిమాకు స్క్రీన్స్ పెరగడం విశేషం. మలయాళంలో కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లనే సాధించింది. లెక్కలు వెల్లడికాపోయినా..అన్ని చోట్ల హౌస్పుల్ కలెక్షన్స్తో రన్ అవుతోంది. ఇక తాజాగా కేరళకు చెందిన అల్లు అర్జున్ ఫ్యాన్ మరక్కడ్లో ‘అల వైకుంఠపురములో’ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ను తన ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. సంక్రాంతి రిలీజైన సినిమాల్లో ఓవర్సీస్లో ఎక్కువ వసూళ్లతో ‘అల వైకుంఠపురములో’ సినిమా ముందు వరసలో ఉంది.
Latest News