by సూర్య | Thu, Jan 16, 2020, 02:27 PM
ఈ సంక్రాంతికి జనవరి 11 న సరిలేరు నీకెవ్వరూ విడుదల కాగా..జనవరి 12 న అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో విడుదల అయ్యింది. ఇక దేశ వ్యాప్తం గా కూడా ఈ రెండు చిత్రాలు తమ సత్తా చాటుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇక సరిలేరు నీకెవ్వరు ఐదు రోజులకు గాను, చెన్నై సిటీ పరిధిలో 57లక్షల గ్రాస్ వసూలు చేసింది. టాలీవుడ్ హీరోల సినిమాలకు ఉండే మార్కెట్ రీత్యా ఇవి మంచి వసూళ్లే అని చెప్పాలి. ఇక మరో సంక్రాంతి మూవీ అల వైకుంఠపురంలో కూడా చెన్నై సిటీలో చెప్పుకోదగ్గ వసూళ్లనే సాధించింది. అల వైకుంఠపురంలో నాలుగు రోజులకు 33 లక్షల గ్రాస్ రాబట్టింది. మరో రెండు రోజులలో వీకెండ్ కూడా రానుంది. కాబట్టి వసూళ్లు మెరుగయ్యే అవకాశం కలదు. కాగా యూఎస్ కలెక్షన్స్ లో అల వైకుంఠపురంలో రికార్డ్ వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాల మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. పండుగ సీజన్లో వచ్చిన చిత్రం కావడంతో తెలుగు ప్రేక్షకులు ఇద్దరి సినిమాలను ఆదరిస్తున్నారు.
Latest News