by సూర్య | Thu, Jan 09, 2020, 07:05 PM
దర్శకుడు సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి' . కాగా నేడు ఈ చిత్రం విడుదలై వంద రోజులు అవుతుంది. సైరా చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మించారు. నయనతార, తమన్నా ప్రధాన హీరోయిన్స్ గా నటించగా అమితాబచ్చన్, జగపతి బాబు, సుధీప్, విజయ్ సేతుపతి కీలక రోల్స్ చేశారు. రాయలసీమకు చెందిన మొదటి తరం స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథగా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఐదు ప్రధాన బాషలలో విడుదల కావడం జరిగింది. వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ క్యాస్ట్ తో 250 కోట్లకు పైగా బడ్జెట్ తో సైరా మూవీ తెరకెక్కింది. దర్శకుడు సురేంధర్ రెడ్డి రెండేళ్లు కష్టపడి విజువల్ వండర్ గా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారు. ఉద్యమ వీరుడిగా నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి విజృభించారు. 2019 గాను టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాస్సింగ్ సాధించిన చిత్రంగా సైరా నరసింహారెడ్డి నిలిచింది .
Latest News