by సూర్య | Sat, Aug 06, 2022, 02:26 PM
ఉదయగిరి మండలం జి అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతి అదృశ్యం పై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అంకమ్మ తెలిపారు. జి. అయ్యవారిపల్లి కి చెందిన యువతి ఈనెల 3వ తేదీ ఇంటినుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులను విచారించగా ఫలితం లేకపోవడంతో తండ్రి చంటయ్య శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై మిస్సింగ్ కేసు నమోదు చేసి యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Latest News