ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకొన్న ఎన్వీ రమణ

by సూర్య | Fri, Aug 05, 2022, 11:11 PM

ఉస్మానియా యూనివర్శిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్ ను భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ‌ అందుకొన్నారు. ఇటీవల ఎన్వీ రమణకు తెలంగాణ‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం గౌర‌వ డాక్ట‌రేట్‌ను ప్ర‌క‌టించింది. ఓయూ డాక్ట‌రేట్‌ను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ శుక్ర‌వారం వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోని ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటైన 82వ స్నాత‌కోత్స‌వంలో భాగంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు అంద‌జేశారు. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా కొన‌సాగుతున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఈ నెల‌లోనే ఆ ప‌ద‌వి నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ పొంద‌నున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఓయూ గౌర‌వ డాక్ట‌రేట్‌ను ప్ర‌దానం చేసింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM