by సూర్య | Fri, Aug 05, 2022, 04:28 PM
నేడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం వేడుకలు నిర్వహించారు. అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన చేపట్టారు. వేదపండితుల మధ్య అభిషేకం నిర్వహించారు. అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులను కనువిందు చేశారు. కోవిడ్ తర్వాత తొలిసారి వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Latest News