by సూర్య | Fri, Aug 05, 2022, 04:18 PM
శ్రావణ మాసం పురష్కరించుకుని పూల ధరలకు రెక్కలొచ్చాయి. చాలా మంది మహిళలు ఈ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నేడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చాలా మంది వ్రతాలు చేస్తారు. ఈ సందర్భంగా నేడు కిలో పూలు రూ.300 నుంచి రూ.400 వరకూ చేరింది. జులై మాసంలో పూల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా మంది రైతులు పూలను నేలపాలు చేశారు. తాజాగా పూల ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Latest News