by సూర్య | Fri, Aug 05, 2022, 03:05 PM
పెద్దవడుగూరు: వర్షాలకు దెబ్బతిన్న పంటలను గురువారం మండల వ్యవసాయాధికారిణి మల్లీశ్వరి పరిశీలించారు. మేడిమాకులపల్లి, తెలికి, లక్షుంపల్లి, బుర్నాకుంట, ముప్పాల గుత్తి, పెద్దవడుగూరు, మల్లేనిపల్లి, చిన్నవడుగూరు, దిమ్మగుడి తదితర గ్రామాల్లో రైతులు సాగుచేసిన ప్రత్తి, వేరుసెనగ పంటలును పరిశీలించి రైతులకు సూచనలు అందించారు. రైతులు పొలాల్లో కాలువలను ఏర్పాటు చేసుకుంటే నీరు నిల్వ ఉండకుండా వెళ్లిపోతుందని చెప్పారు.
Latest News