by సూర్య | Wed, Jun 22, 2022, 11:23 PM
ఆంధ్రప్రదేశ్ లో పీజీసెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 16 యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 145 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 20. ఆగస్టు 17 నుంచి ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. దరఖాస్తు రుసుము ఓసీలకు రూ.850, బీసీలకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.650.
Latest News