టీమిండియాకు షాక్.. విరాట్ కోహ్లికి కరోనా?
by సూర్య |
Wed, Jun 22, 2022, 12:44 PM
ప్రస్తుతం ఇంగ్లాండ్లో టెస్టు ఆడేందుకు వెళ్లిన టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. జట్టులో కీలక బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లి కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కనీసం మాస్కు కూడా పెట్టుకోకుండా కోహ్లి షాపింగ్ చేశాడు. దీనిపై ఇప్పటికే బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తాజాగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో కోహ్లికి పాజిటివ్గా తేలినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Latest News