ఆ మాటలకు సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు: టిమ్ ఫైన్
by సూర్య |
Wed, Jun 22, 2022, 07:38 AM
గతేడాది బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భారత్-ఆసీస్ మధ్య 3వటెస్టులో. భారత ఫేసర్ మహ్మద్ సిరాజ్పై ఆసీస్ అభిమానుల జాత్యహంకార వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. ఆ ఘటనపై ఆసీస్ కెప్టెన్ టిమ్ ఫైన్ తాజాగా స్పందించాడు. "ఆసీస్ అభిమానుల వ్యాఖ్యల తర్వాత సిరాజ్ అంపైర్ దగ్గరకు వెళ్తుంటే అతడి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న సిరాజ్పై ఆసీస్ అభిమానుల తీరు మాకు బాధ కలిగించింది' అని ఫైన్ అన్నాడు.
Latest News