మచ్చలేని మహోన్నత వ్యక్తిని చేతిలో పెట్టుకుని రాష్ట్రపతి అభ్యర్థి కోసం పాకులాటనా: సోమిరెడ్డి

by సూర్య | Wed, Jun 22, 2022, 12:01 AM

ముప్పవరపు వెంకయ్యనాయుడి వంటి మచ్చలేని మహోన్నత వ్యక్తిని చేతిలో పెట్టుకుని రాష్ట్రపతి అభ్యర్థి కోసం పాకులాడుతున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలావుంటే రాష్ట్రపతి ఎన్నిక జులై 18న నిర్వహించనున్నారు. జులై 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జులై 24 నాటికి రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది.  నామినేషన్ల స్వీకరణ జూన్ 29 వరకు జరగనుంది. జూన్ 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. జులై 2తో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవుతుంది. దేశంలో రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. ఇటు అధికార ఎన్డీయే, అటు విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయన పై విధంగా స్పందించారు. 


"జులై 18న దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో అత్యున్నతమైన, రాజ్యాంగపరమైన పదవి... రాష్ట్రపతి పదవి. ప్రపంచదేశాలన్నీ ఈ పదవికి గౌరవం ఇస్తాయి. అయితే, ఎన్డీయే, యూపీఏ, అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థి కోసం వెతుకుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ముప్పవరపు వెంకయ్యనాయుడి వంటి మచ్చలేని మహోన్నత వ్యక్తిని చేతిలో పెట్టుకుని రాష్ట్రపతి అభ్యర్థి కోసం పాకులాడుతున్నాయి. గతంలో ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతి అయిన సంప్రదాయం ఉంది. వెంకయ్యనాయుడిది నిష్కల్మష జీవితం. ఆయన జీవితం ప్రజలకు అంకితం. 


అధికారంలో ఉండే ప్రభుత్వ పెద్దలకు, ఎన్డీయే మిత్రపక్షాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు వెంకయ్యనాయుడు పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించండి. ఎలాంటి పోటీలేకుండా రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవడానికి ఇదే అవకాశం. ఆయన పేరు ప్రకటిస్తే, ఆయనకు పోటీగా అభ్యర్థిని బరిలో దింపడానికి విపక్షాలు కూడా సాహసించవు. వెంకయ్యనాయుడి వంటి మంచి వ్యక్తి రాష్ట్రపతి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. 


రాష్ట్రపతి ఎన్నికలను ఇంత వివాదాస్పదం చేసుకోవాల్సిన అవసరంలేదు. ప్రతిపక్షాలు రోజుకొక అభ్యర్థిని తెరపైకి తీసుకురావాల్సిన అవసరం లేదు. వెంకయ్యనాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రపంచదేశాల్లో భారత్ కు గౌరవం మరింత పెరుగుతుంది" అని సోమిరెడ్డి సూచించారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM