ఆమంచికి సమన్లు జారీ చేసిన సీబీఐ అధికారులు

by సూర్య | Wed, Jun 22, 2022, 12:00 AM

న్యాయ వ్య‌వ‌స్థ‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో రేపు (బుధ‌వారం) త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని  వైసీపీ నేత‌, ప్ర‌కాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు సీబీఐ అధికారులు తాజాగా స‌మ‌న్లు జారీ చేశారు. ఈ కేసులో ఇప్ప‌టికే ఆమంచి ఓ ద‌ఫా సీబీఐ అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. నాడు విశాఖ‌లోని సీబీఐ కార్యాల‌యంలో ఈ విచార‌ణ సాగింది. తాజాగా విజ‌య‌వాడ‌లోని సీబీఐ కార్యాల‌యంలో రేప‌టి విచార‌ణ జ‌ర‌గ‌నుంది. బుధ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సీబీఐ అధికారులు ఆమంచిని కోరారు. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌పై ఏపీ హైకోర్టు వ‌రుస‌గా వ్య‌తిరేక తీర్పులు వెలువ‌రించిన నేప‌థ్యంలో వైసీపీకి చెందిన ప‌లువురు సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు హైకోర్టు న్యాయ‌మూర్తులు, న్యాయ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా ప‌లు కామెంట్లు చేశారు. ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టు ఆదేశాల‌తో సీబీఐ అధికారులు కేసులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM