టీడీపీ నేతలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు

by సూర్య | Sun, May 22, 2022, 12:11 PM

తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేయడం టీడీపీ, ఎల్లో మీడియాకు అలవాటుగా మారిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రోజురోజుకూ వారిలో అనాగరికత పేట్రేగిపోతోందని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌ దావోస్‌ పర్యటనపై యనమల ఆరోపణలు నిసిగ్గుగా ఉన్నాయని, సంస్కారం లేకుండా దిగజారి మాట్లాడుతున్నాడని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దావోస్‌ పర్యటన రహస్యమేమీ కాదు. విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. ఎయిర్‌ ట్రాఫిక్‌తో అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యమైంది. దీంతో లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకునేటప్పటికీ మరింత ఆలస్యమైంది. లండన్‌లో కూడా ఎయిర్‌ట్రాఫిక్‌ విపరీతంగా ఉంది. జురెక్‌లో ల్యాండ్‌ అవడానికి ప్రయాణ షెడ్యూల్‌ సమయం రాత్రి 10 దాటిపోయింది. మళ్లీ ల్యాండింగ్‌ కోసం అధికారులు రిక్వెస్ట్‌ పెట్టారు. ఈ ప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు కూడా స్వయంగా పాల్గొన్నారు. విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నిమయాలు, నిబంధనలపై అవగాహన లేకుండా పనిగట్టుకొని సీఎం వైయస్‌ జగన్‌పై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతల దుష్ప్రచారంపై మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM