by సూర్య | Sun, May 22, 2022, 09:26 AM
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఏపిఐఐసి చైర్మన్ మెట్టుగోవిందరెడ్డి, ఆయన తనయుడు విశ్వనాథరెడ్డి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు. ముందుగానే దావోస్ చేరుకున్న మెట్టు గోవిందరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాసేపు మెట్టు గోవిందరెడ్డి, తనయుడు విశ్వనాథరెడ్డి లతో సిఎం మాట్లాడారు. వీరిమద్య అనేక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Latest News