by సూర్య | Sat, May 21, 2022, 07:26 PM
మారిన జీవన శైలీ, ఉరుకులుపరుగులతో కూడిన జీవితంలో హైబీపీ సర్వసాధారణంగా మారింది. ప్రస్తుత రోజుల్లో హైబీపీ సాధారణ సమస్యగా మారిపోయింది. . ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మిలియన్ల మంది ప్రజలు దీని బారిన పడుతున్నారు. హైబీపీకి ఏ లక్షణాలు కనిపించవు. దీని వల్ల ఈ సమస్య ఉన్న చాలామందికి.. వారికి హైబీపీ ఉందన్న విషయమూ తెలియదు. అధిక రక్తపోటు ఎన్నో అనర్థాలకు మూల కారణం. హైబీపీని నియంత్రించుకోకపోతే అది ప్రాణాంతకం కూడా మారుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి అధిక రక్తపోటు ఉంది. మొత్తం జనాభాలో కేవలం 10 శాతం మందికి మాత్రమే బీపీ కంట్రోల్లో ఉంది.
కేవలం మందులు వాడితే.. బీపీ కంట్రోల్లో ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఉప్పు తగ్గించినా చాలు అనుకుంటారు. ఇలాంటి భావన ఉంటే.. మీరు పొరబడినట్లే. మంచి ఎక్స్అర్సైజ్, ఆహార నియమాలు పాటించకపోతే.. హైబీపీ మీ ప్రాణానికే.. డేంజర్గా మారుతుంది. చక్కని ఆహారపు అలవాట్లను అలవర్చుకున్నట్లయితే హైబీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కొన్ని పండ్లు తీసుకుంటే.. హైబీపీని కంట్రోల్లో ఉంచుచోవచ్చని చెబుతున్నారు. అవేంటో చూసేయండి.
Latest News