by సూర్య | Sat, May 21, 2022, 03:30 PM
అతడికి ఇద్దరు భార్యలు. వ్యాపారం కూడా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఈ క్రమంలో రెండో భార్య ఇంట్లో ఉన్న అతడు హఠాత్తుగా హత్యకు గురయ్యాడు. ఇద్దరు భార్యలూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండగా, అసలు హంతకుడు ఎవరోనని తేల్చే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలోని రన్ హోలా ప్రాంతానికి చెందిన వీర బహదూర్ వర్మ(50) బిజినెస్ చేస్తుంటాడు. ఆయనకు ఇద్దరు భార్యలుండగా రెండో భార్య చందా దేవితో కలిసి స్థానికంగా అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఆస్తి తగాదాల కారణంగా మొదటి భార్య పిల్లలను తీసుకుని వేరే ప్రాంతంలో ఉంటోంది. అయితే ఇటీవల బహదూర్ వర్మ హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని చందాదేవి పోలీసులకు తెలిపింది. పోలీసులు అతడి హత్య విషయాన్ని మొదటి భార్యకు తెలియజేశారు. ఆమె వచ్చి తన భర్తను చూసి బోరున విలపించింది. ఆస్తి కోసం రెండవ భార్య భర్తను హత్య చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. అయితే రెండో భార్య చందాదేవి పోలీసులకు మరోలా చెప్పింది. తమ ఇంట్లో దొంగలు పడి, భర్తను హత్య చేశారని తెలిపింది. ఈ ఘటన వెనుక మొదటి భార్య హస్తం ఉందని ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.
Latest News