by సూర్య | Sat, May 21, 2022, 03:07 PM
వర్షాలు రోడ్డు మార్గాలనే కాదు ఆకాశ మార్గంలో నడిచే విమానాలకు కూడా అంతరాయం కలిగిస్తుంది. తాజాగా కురిసిన వర్షాల వల్ల పలు విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో గత శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రయాణిస్తున్న విమానం సహా పలు విమనాలను దారి మళ్లించారు. విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడటంతో వాటిని లక్నో, జైపూర్లకు మళ్లించినట్టు అధికారులు తెలిపారు.
Latest News