చంద్రన్న మార్గమే రాజమార్గం: నారా లోకేష్

by సూర్య | Sat, May 21, 2022, 03:06 PM

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందిస్తూ చంద్రన్న మార్గమే రాజమార్గం అని పేర్కొన్నారు.  ‘మా నాన్నని ద్వేషించేవారు, విమర్శించేవారు సైతం ఆఖరికి ఆయన మార్గంలో నడవాల్సిందే. సంక్షేమం నుండి ఐటి వరకూ.. అమరావతి నుంచి విదేశాలు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించడం వరకూ చంద్రన్న మార్గమే రాజమార్గం. దావోస్ ఎందుకు డబ్బులు దండగ అన్న జగన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా స్పెషల్ ఫ్లైట్ లో దావోస్ పర్యటన కు వెళ్లాల్సి వచ్చింది. బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో’ అంటూ సెటైర్లు పేల్చారు.


ఇదిలావుంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. ఈ నెలాఖరు వరకు పర్యటన కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జగన్‌ను టీడీపీ టార్గెట్ చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు విమర్శలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM