బాలికపై కారులో అత్యాచారం

by సూర్య | Sat, May 14, 2022, 11:09 AM

పదిహేనేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బుధవారం రాత్రి ధుర్వా రింగురోడ్డుపై వెళ్తున్న పదిహేనేళ్ల బాలికను ఐదుగురు యువకులు కిడ్నాప్ చేసి, కారులో ఎక్కించుకెళ్లారు. ఆపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. రతు పోలీస్ స్టేషన్ పరిధిలోని దలాదలి ప్రాంతంలో రాత్రి పూట పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఒక రెస్టారెంటు వద్ద బాలికను కిడ్నాప్ చేసిన కారు కనిపించింది.ఆ కారు అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు వెళ్లి తనిఖీ చేశారు. అప్పుడు కారులో ఏడుస్తూ ఉన్న బాలిక, ఐదుగురు యువకులు కనిపించారు. విషయం ఆరాతీయగా అత్యాచారం ఘటన బయటపడింది. వెంటనే పోలీసులు ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. వీళ్లంతా దాదాపు ఇరవై ఏళ్లలోపు వయసువాళ్లే. అత్యాచారానికి గురైన బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోందని రాంచీ ఎస్పీ నౌషద్ ఆలమ్ చెప్పారు.


 


 

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM