by సూర్య | Sat, May 14, 2022, 09:36 AM
గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న ఈదురుగాలులు, అకాల వర్షం కనేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లోని రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. హెచ్ ఎల్ సి ఆయకట్టు కింద సుమారు 500 ఎకరాలకుపైగా వరిపంట నేలకొరిగింది. తాజాగా కురిసిన వర్షాలకు నేలకొరిగిన వరి నీటమునిగి మెలకలొచ్చాయి. దీంతో చేతికొచ్చిన పంట నాశనమైందని రైతులు వాపోయారు. అప్పులు చేసి ఎకరానికి సుమారు రూ. 45 వేలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేశామని 43 ఉడేగోళం గ్రామరైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.
Latest News