by సూర్య | Sat, May 14, 2022, 09:34 AM
చెదుళ్ల లోని బీసీ కాలనీలో ఇంటి దగ్గర చెత్త, మురుగు ప్రవాహానికి సంబంధించిన గొడవలో ఒక వర్గం వారు కర్రలతో దాడి చేసి ఆరుగురు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్ర వారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. తుమ్మల పెద్దన్న అనే వ్యక్తి ఇంటి వద్ద చెత్త, మురుగునీరు విషయమై జరిగిన వాగ్వాదంలో ఆయన భార్య నిర్మల, కుటుంబీ కులు మహేష్, వెంకటరాముడు, ఆదెమ్మ, సుబ్బరాయుడిపై మరో వర్గానికి చెందిన రామాంజనేయులు, సింగరయ్య, శివపురం పెద్దన్న, శ్రీనివాసులు, సుధాకర్, రమేష్ తదిత రులు కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. వారు తీవ్రంగా గాయపడగా. అనం తపురం వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Latest News