by సూర్య | Fri, May 13, 2022, 04:44 PM
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని చదళ్ల గ్రామంలో నారాయణరెడ్డి తన మేకలకు కాపలాగా దొడ్డిలోనే నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు వచ్చి మేకలను అపహరించే ప్రయత్నం చేశారు. వారిని గుర్తించిన మేకల కాపరిపై కత్తితో దాడి చేసి పారిపోయారు. ఉదయం అపస్మారక స్థితిలో గల అతనిని కుటుంబ సభ్యులు గుర్తించి 108 సిబ్బందికి సమాచారం అందించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరిని పోలీసులకు అప్పగించారు.
Latest News