![]() |
![]() |
by సూర్య | Fri, May 13, 2022, 04:45 PM
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రమైన పేటూరు పంచాయతీ పొలికిమాకులపల్లె గ్రామానికి నీరు సరఫరా అయ్యే బోరు మోటారుకు ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు గురికావడంతో వారం రోజులుగా గ్రామంలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గ్రామస్థులు వ్యవసాయ బోర్ల నుంచి నీరు తెచ్చుకొంటున్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ విషయమై ఏఈ మహేందర్ రెడ్డిని వివరణ కోరగా త్వరగా నీటి సమస్యలు తీరుస్తామని అన్నారు.
Latest News