ప్రేమించుకున్న ఇద్దరు యువతులు.. గ్రామం వదిలి పరార్

by సూర్య | Fri, May 13, 2022, 04:29 PM

కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గ్రామం వదిలి పారిపోయారు. పావగడ ప్రాంతానికి చెందిన ఓ 22 ఏళ్ల యువతి తుమకూరులోని ఓ కాలేజీలో డిప్లొమా కోర్సు చేస్తోంది. అదే కాలేజీలో చదువుతున్న మరో యువతితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 


కానీ వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కానీ పోలీసులు కూడా యువతుల పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారు ఆ గ్రామం విడిచి వెళ్లిపోయారు. గురువారం మళ్లీ తుమకూరుకు తిరిగొచ్చారు. యువతులు తిరిగి వచ్చినట్టు సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు పోలీసుల సాయంతో వారికి నచ్చజెప్పి ఇళ్లకు తీసుకెళ్లారు.

Latest News

 
టిడిపి అరాచకం మాదిగలపై దాడి Mon, May 06, 2024, 03:59 PM
అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:55 PM
పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన Mon, May 06, 2024, 03:53 PM
పేదల సంక్షేమమే వైసీపీ ధ్యేయం: నాగార్జున Mon, May 06, 2024, 03:51 PM
భైరవకోనలో ప్రత్యేక పూజలు Mon, May 06, 2024, 03:49 PM