by సూర్య | Fri, May 13, 2022, 04:29 PM
కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గ్రామం వదిలి పారిపోయారు. పావగడ ప్రాంతానికి చెందిన ఓ 22 ఏళ్ల యువతి తుమకూరులోని ఓ కాలేజీలో డిప్లొమా కోర్సు చేస్తోంది. అదే కాలేజీలో చదువుతున్న మరో యువతితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
కానీ వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కానీ పోలీసులు కూడా యువతుల పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారు ఆ గ్రామం విడిచి వెళ్లిపోయారు. గురువారం మళ్లీ తుమకూరుకు తిరిగొచ్చారు. యువతులు తిరిగి వచ్చినట్టు సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు పోలీసుల సాయంతో వారికి నచ్చజెప్పి ఇళ్లకు తీసుకెళ్లారు.
Latest News