by సూర్య | Mon, Jan 17, 2022, 03:43 PM
ప్రకాశం: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గుడ్లూరు మండలం సాలిపేట రావూరు మధ్యలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు. రామాయపట్నం నుంచి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో మొత్తం 8 మంది కూలీలు ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా కావలి ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నందున ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు.
Latest News