రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తా 8 మందికి గాయాలు

by సూర్య | Mon, Jan 17, 2022, 03:43 PM

ప్రకాశం: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గుడ్లూరు మండలం సాలిపేట రావూరు మధ్యలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు. రామాయపట్నం నుంచి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో మొత్తం 8 మంది కూలీలు ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా కావలి ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నందున ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు.

Latest News

 
గంటకు 280 కిలోమీటర్ల వేగంతో భారత తొలి బుల్లెట్ రైలు Fri, Sep 20, 2024, 10:38 PM
సింహాచలం అప్పన్నకు హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం Fri, Sep 20, 2024, 10:18 PM
తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం వేళ కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం Fri, Sep 20, 2024, 10:16 PM
విజయవాడలో వెరైటీ దొంగ.. ఆ టైంలో మాత్రమే చోరీలు Fri, Sep 20, 2024, 10:13 PM
ఏపీ రైతులకు.. అక్టోబర్ ఒకటి నుంచే మొదలు Fri, Sep 20, 2024, 10:01 PM