by సూర్య | Mon, Jan 17, 2022, 03:38 PM
ఫిబ్రవరి 14న జరగాల్సిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన తేదీకి బదులుగా ఫిబ్రవరి 20 పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి నేపథ్యంలో లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్ప్రదేశ్ వారణాసికి వెళ్తుంటారు. ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉండదని అందువల్ల ఎన్నికలను వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. దీంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
Latest News