by సూర్య | Mon, Jan 17, 2022, 12:52 PM
వ్యక్తుల అనుమతి లేకుండా కరోనా టీకా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. బలవంతంగా టీకా ఇవ్వడం తమ ఉద్దేశం కాదని.. ప్రస్తుతం వైరస్ కారణంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే అందరూ టీకా వేసుకోవాలని సూచించినట్లు వివరించింది. ఎలాంటి సేవలు పొందడానికైనా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేస్తూ ఎటువంటి మార్గదర్శకాలను ఇప్పటి వరకు జారీ చేయలనే సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కొన్ని రకాల సేవలు పొందేందుకు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాలన్న నిబంధన నుంచి దివ్యాంగులకు మినహాయింపునివ్వాలని ఓ స్వచ్ఛంధ సంస్థ పిటిషన్ దాఖలు చేయగా ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది.
Latest News