by సూర్య | Mon, Jan 17, 2022, 12:49 PM
గుంటూరు నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా సోమవారం నాడు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరగవలసిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం రద్దు చేయబడినట్లు నగర కమిషనర్ చల్లా అనురాధ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు స్పందన కార్యక్రమం రద్దు విషయాన్ని గమనించాలని, స్థానిక సమస్యల పై నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0863-2345103 కి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Latest News