by సూర్య | Mon, Jan 17, 2022, 12:26 PM
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే అన్నప్రసాద వితరణ, పుణ్యస్నానాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న వెల్లడించారు. ఎల్లుండి నుంచి ఆర్జిత సేవా టిక్కెట్లను భక్తులు ఆన్ లైన్ లో తీసుకోవాలని తెలిపారు. శీఘ్ర, అతిశీఘ్ర దర్శన టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఈవో తెలిపారు.
Latest News