ఢిల్లీలో కూర్చోని ఏమిటీ ఈ ఎడుపులు

by సూర్య | Sun, Jan 16, 2022, 08:01 PM

తన నియోజకవర్గ ప్రజల కు మొహం చూపించలేక ఎంపీ రఘురామ కృష్ణంరాజు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు.తన హత్యకు కుట్ర జరుగుతోందని, ఝార్ఖండ్ వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ అసంతృప్త‌ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై త్వ‌ర‌లోనే అన్ని వివరాలతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని ఆయ‌న అన్నారు. దీనిపై స్పందిస్తూ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ''గుడ్డ కాల్చి మొహాన వేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే అనుకుంటున్నాడు. ఢిల్లీలో కూర్చొని 'నన్ను చంపేస్తారు' అని ఏడుపు మొదలెట్టాడు. నర్సాపురం ప్రజలకు మొహం చూపించలేకే ఈ పబ్లిసిటీ స్టంట్. చీప్ పబ్లిసిటీ వస్తుందంటే చివరకు గోదాట్లోకైనా దూకి నన్ను ఎవరో తోసేశారు అనే రకం'' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM