by సూర్య | Sun, Jan 16, 2022, 07:47 PM
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో కరోనా కలకలం మొదలైంది. ఆయన భార్య శచీదేవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో అర్ధాంగితో పాటు మంత్రి బాలినేని కూడా హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. అటు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో నేతలు స్పందిస్తూ, తమను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Latest News