by సూర్య | Sun, Jan 16, 2022, 03:53 PM
నరసరావుపేట టీడీపీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కేసులో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విడుదల చేయాలని అరవింద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో అరవింద్కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ను టీడీపీ నేతలు ఈరోజు పరామర్శించారు. ప్రస్తుతం అరవింద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Latest News