by సూర్య | Sun, Jan 16, 2022, 03:39 PM
భారత్ లో గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2లక్షల 71వేల 202 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. భారత్లో 24 గంటల్లో లక్షా 38వేల 331మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయలో కరోనాతో 314 మంది మరణించారు. లేటెస్ట్ పెరుగుదలతో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15 లక్షల 50 వేల 377కి పెరిగింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,50,85,721కి చేరుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 4,86,066కి చేరుకుంది
Latest News