by సూర్య | Sun, Jan 16, 2022, 10:05 AM
కృష్ణా: విద్యుదాఘాతంతో వెల్డర్ మృతి చెందిన ఘటన శుక్ర వారం కృష్ణ జిల్లా పెనమలూరు గ్రామంలో జరిగింది. సీఐ ఎం. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నెహ్రూనగర్కు చెందిన దొండపాటి బాలకృష్ణ (45) వెల్డర్గా పని చేస్తాడు. అతను పెనమలూరులో అరవపల్లి శివప్రసాద్ ఇంట్లో షెడ్డు నిర్మాణం చేయటానికి తోటి వర్కుర్లు రవ్వా మోహన్రావు, సాయితో కలిసి వచ్చాడు. బాలకృష్ణ పని చేస్తున్న సమయంలో అతనికి కరెంట్ షాక్ తగిలడంతో అపస్మారక స్థితికి చేరాడు. పోరంకిలో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందాడు. అతని భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News