by సూర్య | Sun, Jan 16, 2022, 10:03 AM
గుంటూరు: పండగ వేళ హోటళ్లు, దాబాలు జనాలతో కొక్కిరిసిపోయాయి. దీంతో రాత్రి సమయం మించిన తరువాత కూడా హోటళ్లు తెరిచే ఉన్నాయి. ఈ క్రమంలో మంగళగిరి పరిధిలోని ఎన్నారై వై జంక్షన్ సమీపంలోని ఓ దాబా హోటల్ లో శనివారం రాత్రి మద్యం మత్తులో దాబా యజమానిపై ఇద్దరు యువకులు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులకు దాబా యజమాని సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బందిపై సైతం ఇద్దరు యువకులు ఘర్షణకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇది ఇలా ఉండగా అదే సమయంలో జాతీయ రహదారి పై ఉన్న మరో దాబా హోటల్ యజమాని పై ఆరుగురు యువకులు మద్యం మత్తులో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులని అదుపులోకి తీసుకున్నారు. ఏది ఏమైనా సమయం దాటిన తరువాత దాబా హోటళ్లు నిర్వహించి డబ్బు సంపాదనే ద్యేయంగా పని చేస్తున్న యజమానులు తీరు వివాదాస్పదం అవుతుంది. ఏదైనా జరగరాని ఘటన జరిగితే అందుకే బాధ్యులు ఎవరవుతారని అందరి ప్రశ్న.
Latest News