by సూర్య | Sun, Jan 16, 2022, 09:20 AM
రక్త నమూనాలు అవసరం లేకుండానే షుగర్ టెస్ట్ చేసే పరికరాన్ని గచ్చిబౌలిలోని బ్లూసెమీ సంస్థ ఆవిష్కరించింది. అరచేతిలో ఇమిడిపోయే ఈ చిన్న పరికరంతో ఇంట్లోనే ఆరు రకాల వైద్య పరీక్షలు చేసుకునే అవకాశం ఉంటుంది. ‘ఐవా’ పేరుతో రూపొందించిన ఈ పరికరం అన్ని పరీక్షలు దాటుకుని విజయవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది. వచ్చే మార్చిలో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరికరం సాయంతో బ్లడ్ గ్లూకోజ్, ఈసీజీ, గుండె వేగం, బీపీ, ఎస్పీవో2, టెంపరేచర్ తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ తో బ్లూటూత్ సాయంతో ఈ పరికరాన్ని కనెక్ట్ చేసుకోవాలి. అనంతరం పరికరాన్ని అరచేతితో పట్టుకుని 60 సెకన్లు ఉంటే వైద్య పరీక్షల ఫలితాలు యాప్లో ప్రత్యక్షమవుతాయి. ఫలితాలను ప్రకటించడమే కాకుండా చిన్నపాటి సూచనలు కూడా చేస్తుంది. దీని ధరను రూ.15,490గా నిర్ణయించినట్లు సంస్థ పేర్కోంది.
Latest News