by సూర్య | Sun, Jan 16, 2022, 09:08 AM
అండర్ - 19 ప్రపంచకప్ టోర్నీలో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ బోణీ కొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 46.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేజింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 45.4 ఓవర్లలో చివరి వికెట్ కోల్పోయి 188 పరుగులు చేసింది. భారత్ కెప్టెన్ యాష్ ధుల్(82)రాణించడంతో మంచి స్కోర్ సాధించగలిగింది. భారత బౌలర్లలో విక్కి 5, రాజ్ 4 వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించారు.
Latest News